Latest posts

All
fashion
lifestyle
sports
tech

Trending News

Popular

మళ్లీ దద్దరిల్లిన గల్ఫ్
నేపాల్‌లో నిరసనల హోరు
రేపటి నుంచి సవరించిన భూముల విలువలు
ఉద్యోగులకు భరోసాగా జీవిత బీమా – Visalaandhra

మళ్లీ దద్దరిల్లిన గల్ఫ్

. అమెరికా స్థావరాలపై విరుచుకుపడ్డ ఇరాన్. కువైట్, బెహ్రెయిన్‌పై దాడులు. ఇది ఆత్మరక్షణే: ఐఆర్‌జీసీ తెహ్రాన్: పశ్చిమాసియా మళ్లీ బాంబుల మోత మోగింది. డ్రోన్‌లు, క్షిపణుల దాడులతో దద్దరిల్లింది. శాంతి చర్చలు జరుగుతుండగానే అమెరికా- ఇరాన్ మధ్య భీకర పోరుసాగింది. కువైట్, బహ్రెయిన్‌లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ విరుచుకుపడింది. కువైట్‌లోని అల్ సలేం`బహ్రెయిన్‌లోని ఈసా వైమానిక స్థావరాలపై దాడులు చేసింది. అంతర్జాతీయ చట్టం, కాల్పుల విరమణను అతిక్రమించి, ఖేష్మ్ ద్వీపంలోని కమÖ్యనికేషన్స్ టవర్‌పై, హోర్మూజ్ జల…

Read More

నేపాల్‌లో నిరసనల హోరు

ప్రధాని బాలెన్ షా రాజీనామాకు డిమాండ్వీధుల్లోకి వచ్చిన విద్యార్థులు`ప్రతిపక్షాలుసార్వభౌమత్వం కాపాడుదామని నినాదంనష్ట నివారణ చర్యల్లో విదేశాంగ శాఖ ఖాట్మండు: నేపాల్ రాజకీయం మళ్లీ వేడెక్కింది. సరిహద్దు ఆక్రమణలపై ప్రధాని బాలెన్ షా వ్యాఖ్యలు అగ్గిరాజేశాయి. దేశమంతటా నిరసనలను హోరెత్తాయి. బాలేంద్ర ‘బాలెన’ షా రాజీనామాకు డిమాండ్ మార్మోగింది. భారత్`నేపాల్ సరిహద్దు వివాదం గురించి పార్లమెంటులో బాలెంద్ర చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. విద్యార్థులు వీధుల్లోకి వచ్చి ప్రధాని రాజీనామాను డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలు కూడా గొంతు…

Read More

రేపటి నుంచి సవరించిన భూముల విలువలు

. క్షేత్రస్థాయి అధ్యయనం ఆధారంగా నిర్ణయం. మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి విశాలాంధ్ర-హైదరాబాద్: రాష్ట్రంలో భూముల విలువలను సవరించాలని, కొన్ని ప్రాంతాల్లో వాస్తవ ధరలతో పోలిస్తే భారీగా హెచ్చుతగ్గు లున్న భూముల ధరలను క్రమబద్ధీకరించాలని రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం మేరకు సవరించిన భూముల విలువలు ఈ నెల 5 నుంచి అమలులోకి తెస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

Read More

ఉద్యోగులకు భరోసాగా జీవిత బీమా – Visalaandhra

మృతుని భార్యకు రూ.కోటి చెక్కును అందజేసిన డిప్యూటీ సీఎం భట్టి విశాలాంధ్ర-హైదరాబాద్: ఉద్యోగులకు భరోసాగా జీవిత బీమా నిలుస్తుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఎన్పీడీసీఎల్ పరిధిలో ప్రమాదవశాత్తు మృతి చెందిన లైన్‌మెన్ సోన్కాంబ్లే ప్రమోద్ కుమార్ భార్య (నామినీ) సోన్కాంబ్లే స్వప్నకు రూ. 1 కోటి విలువైన ప్రమాద బీమా చెక్కును బుధవారం ప్రజాభవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన అందజేశారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఎన్పీడీసీఎల్‌కు గతంలో కుదిరిన అవగాహన ఒప్పందం (ఎంఓయు)…

Read More

రాజకీయ ప్రయోజనాల కోసంతెలుగు ప్రజల్లో చిచ్చుపెట్టొద్దు

. పవన్ కల్యాణ్‌కు కూనంనేని చురక. పరిపక్వత లేని వివాదాస్పద వ్యాఖ్యల వెనుక ఉద్దేశం ఏంటని నిలదీత. నేడు బషీర్‌బాగ్‌లో రౌండ్ టేబుల్ సమావేశం విశాలాంధ్ర – హైదరాబాద్: ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన రాజకీయ ప్రయోజనాల కోసం ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేయడం ప్రజా ద్రోహమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎలఏ కూనంనేని సాంబశివరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ పరిపక్వత…

Read More

కీలక రంగాల్లో జర్మనీతో భాగస్వామ్యం – Visalaandhra

. టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్‌లు, లైఫ్ సైన్సెస్ రంగాల్లో పరస్పర సహకారం కోసం ఎంవోయÖ. సీఎం రేవంత్‌తో తురింగియా ప్రతినిధి బృందం భేటీ విశాలాంధ్ర – హైదరాబాద్: తెలంగాణలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి చర్యలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. జర్మనీలోని తురింగియా రాష్ట్రం కీలక రంగాల్లో తెలంగాణతో భాగస్వామ్యానికి ముందుకొచ్చింది. టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్‌లు, లైఫ్ సైన్సెస్ రంగాల్లో పరస్పర సహకారం కోసం తెలంగాణ ప్రభుత్వం, తురింగియా రాష్ట్ర…

Read More

సీడీఎస్‌కూ ప్రీ-టాక్ కష్టాలు

విశాలాంధ్ర-విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ)లో పరిశోధన (పీహెచ్‌డీ) విద్యార్థుల విషయంలో అధికారుల వైఖరి వివాదాస్పదంగా మారింది. భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ ఎనఎస్ రాజా సుబ్రమణి సైతం వర్సిటీ వేధింపులకు గురికావడం విద్యాశాఖలో కలకలం రేపింది. అత్యున్నత స్థాయి పదవిలో ఉంటేనే పట్టించుకోకపోతే… ఇక సామాన్య విద్యార్థుల సాధకబాధలు పట్టించుకుంటారా అని విద్యావేత్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2022లో ఏయూ టీడీఆర్ హబ్ ద్వారా కామర్స్ అండ్ మేనేజ్‌మెంట్ విభాగంలో పీహెచ్‌డీ అడ్మిషన్…

Read More

డీఎస్సీపై వైసీపీ ఫేక్ ప్రచారం

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : డీఎస్సీపై వైసీపీ ఫేక్ ప్రచారం చేస్తుందని టీడీపీ మండల అధ్యక్షులు గవిగట్టు మల్లికార్జున విమర్శించారు. బుధవారం పెద్దకడబూరులో ఆమె విలేకరులతో మాట్లాడుతూ గత ఐదు ఏళ్ళలో ఒక్క డీఎస్సీ కూడా వేయకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, పార్టీ నాయకులకు కూటమి ప్రభుత్వంపై మాట్లాడే అర్హత లేదని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటి సంతకం మెగా డీఎస్సీపై పెట్టి, 148 రోజుల్లోనే…

Read More

అక్షరమే ఆయుధంగా పనిచేసే పాత్రికేయులపై బెదిరింపులా?

: సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సి. జాఫర్ విశాలాంధ్ర-​రాప్తాడు : సమయపాలన పాటించకుండా ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తున్న పెట్రోల్ బంకు దుస్థితిపై వార్తా కవరేజీలో భాగంగా ఫొటోలు తీసినందుకు విశాలాంధ్ర విలేకరి శ్రీమివాసులును ఫోన్ లో బెదిరించడం దుర్మార్గమని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సి. జాఫర్ తీవ్రంగా ఖండించారు. గోవిందరాజులు అనే వ్యక్తి ఫోన్ బెదిరింపులు: బంకు నిర్వాహకుడు స్వరూప్.. అనంతపురానికి చెందిన గోవిందరాజులు అనే వ్యక్తితో “విశాలాంధ్ర విలేకరి శ్రీనివాసులను ఫోన్లో బెదిరించాడు….

Read More

ఉదయం 6 దాటినా తెరవని పెట్రోల్ బంకు.. హైవేపై వాహనదారుల అవస్థలు!

​అంబులెన్స్‌లకూ తప్పని ఇబ్బందులు.. పట్టించుకోని నిర్వాహకులు​స్పందించి చర్యలు తీసుకోవాలంటున్న స్థానికులు, ప్రయాణికులు​ నిబంధనలు కాగితాలకే పరిమితం ​విశాలాంధ్ర – రాప్తాడు: నియోజకవర్గ కేంద్రం రాప్తాడు హైవే జంక్షన్ లో ఉన్న భారత్ పెట్రోలియం బంకు నిర్వాహకుల వైఖరి వల్ల ప్రయాణికులు, స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. నిరంతరం వందలాది వాహనాలు రాకపోకలు సాగించే జాతీయ రహదారిపై ఉన్న ఈ బంకు యాజమాన్యం గత మూడు నెలలుగా కనీస బాధ్యత లేకుండా వ్యవహరిస్తుండటంతో వాహనదారులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ​ సమయం…

Read More